Telangana news : జగిత్యాలలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మల్యాల మండలం రాజారాంపల్లి స్టేజ్‌ వద్ద బైక్‌, ఆటో ఢీ కొని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Published : 31 Jan 2022 01:03 IST

మల్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారం గ్రామ సమీపంలోని జగిత్యాల-కరీంనగర్‌ ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై చిరంజీవి కథనం ప్రకారం.. మల్యాలకు చెందిన సంజీవ్‌(25), మధు ద్విచక్రవాహనంపై జగిత్యాల వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొంది. దీంతో సంజీవ్‌తో ఆటోలో ఉన్న గోపాల్‌, మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జగిత్యాల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన గోపాల్‌, మరో వ్యక్తిని ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. వీరు జగిత్యాల పరిధిలోని అర్బన్‌ కాలనీలో నిర్మించే రెండు పడకగదుల నిర్మాణంలో కార్మికులుగా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని