Telangana News: పల్టీలు కొడుతూ డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురి మృతి

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.

Published : 05 Jun 2022 14:19 IST

రఘునాథపల్లె: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హనుమకొండ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న టవేరా వాహనం రఘునాథపల్లె మండలం గోవర్ధనగిరి దర్గా వద్దకు రాగానే పంక్చరై అదుపుతప్పింది. ఈ క్రమంలో రహదారిపై 70 మీటర్ల మేర పల్టీలు కొడుతూ వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం వేగం అదుపుకాకపోవడంతో డివైడర్‌పైనే వాహనం దూసుకెళ్లింది. దీంతో అందులో ఉన్న ఏడుగురు వ్యక్తులు రహదారిపై చెల్లాచెదురుగా పడిపోయారు.

ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మిగిలిన నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి వచ్చారు. స్థానికులు సాయంతో అంబులెన్స్‌లో క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని