Kakinada: గుడిలోకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురి మృతి

కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున తొండంగి మండలం ఎ.కొత్తపల్లి వద్ద గ్రావెల్‌ లారీ బీభత్సం సృష్టించింది.

Updated : 04 Jun 2023 09:21 IST

తొండంగి: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున తొండంగి మండలం ఎ.కొత్తపల్లి వద్ద గ్రావెల్‌ లారీ బీభత్సం సృష్టించింది. అన్నవరం నుంచి ఒంటిమామిడి వైపునకు వెళ్తున్న లారీ.. ఎ.కొత్తపల్లిలో రోడ్డు పక్కనే ఉన్న తాగునీటి ట్యాంకును ఢీ కొట్టిట్టి పక్కనే ఉన్న వినాయకుడి గుడిపైకి దూసుకెళ్లింది. 

ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ చుక్కల శేఖర్‌(28), క్లీనర్‌ కోనూరు నాగేంద్ర(23)తోపాటు గుడిలో నిద్రిస్తున్న  స్థానికుడు సోము లక్ష్మణరావు (48)  అక్కడికక్కడే మృతి చెందారు.  మృతులు శేఖర్‌, నాగేంద్రలను ప్రత్తిపాడు మండలం గజ్జనపూడి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని