Kakinada: ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్‌.. ముగ్గురి మృతి

కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తొండంగి మండలం కొత్త ముసలయ్యపేట వద్ద ట్రాక్టర్‌ను బైక్‌ ఢీకొట్టింది.

Updated : 08 Jun 2023 07:32 IST

తుని: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తొండంగి మండలం కొత్త ముసలయ్యపేట వద్ద ట్రాక్టర్‌ను బైక్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఘటనాస్థలంలోనే ఇద్దరు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. మృతులను యు.కొత్తపల్లి మండలం శ్రీరాంపురం గ్రామస్థులుగా గుర్తించారు. ఒంటిమామిడి నుంచి శ్రీరాంపురం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని