Crime News: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మహిళలు మృతి

కాకినాడ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మహిళలు మృతి చెందారు. 

Updated : 14 May 2023 17:53 IST

తాళ్లరేవు: కాకినాడ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. తాళ్లరేవు మండలం క్వారింగ పంచాయతీ పరిధిలోని సుబ్బరాయుని దిమ్మె కూడలిలో ప్రైవేటు బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు మృతి చెందారు. మరో నలుగురిని యానాం ఆసుపత్రికి తరలించారు. సీతారామపురంలోని రొయ్యల పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలు విధులు ముగించుకొని నేలపల్లి, యానాం గ్రామాలకు ఆటోలో బయలుదేరారు. 

బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు బస్సు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనతో ఈ దర్ఘుటన జరగింది. ఆటో నుజ్జునుజ్జవడంతో ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో మహిళ మృతి చెందింది. ఘటనాస్థలిలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆటోలో ఇద్దరి మృతదేహాల ఇరుక్కుపోగా.. స్థానికుల సాయంతో అతి కష్టం మీద బయటకు తీశారు. మృతదేహాలను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రమాద స్థలిని మాజీ మంత్రి కన్నబాబు, యానాం, ముమ్మిడివరం ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్‌ కుమార్‌, శ్రీనివాస్‌ అశోక్‌ పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని