Road Accident: కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

జిల్లాలోని సదాశివనగర్‌ మండలం పద్మాజీవాడి వద్ద సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Updated : 15 Mar 2022 05:51 IST

కామారెడ్డి: జిల్లాలోని సదాశివనగర్‌ మండలం పద్మాజీవాడి వద్ద సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వైపు వెళ్తున్న ట్రక్కు  పద్మాజీవాడి ఎక్స్‌రోడ్డ్‌ వద్ద ఆటోను ఢీకొట్టింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు ఆసుపత్రిగా తరలిస్తుండగా మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మృతి చెందినవారు లింగంపేట మండలం కొండాపూర్‌కు చెందిన చోటేమియా(50), నిజాంసాగర్‌ మండలం అచ్చంపేటకు చెందిన కౌరున్‌(45), హైదరాబాద్‌రు చెందిన సయ్యద్‌ సారిక్‌(70)గా గుర్తించారు. గాంధారి మండలం సీతాయిపల్లిలో అంత్యక్రియలకు హాజరై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని