గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులో మంటలు.. 8 మంది సజీవదహనం!
కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. కలబురి జిల్లా కమలాపురలో
ఇంటర్నెట్డెస్క్: కర్ణాటకలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కలబురిగి జిల్లా కమలాపురలో గూడ్స్ లారీని ఆరెంజ్ ట్రావెల్స్కు చెందిన స్లీపర్ బస్సు బలంగా ఢీకొట్టి పక్కనే ఉన్న ఓ గుంతలో బోల్తా పడింది. ఈ క్రమంలో మంటలు చెలరేగడంతో నిమిషాల వ్యవధిలో బస్సు కాలిపోయింది. ఈ ఘటనలో 8 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 27 మంది గాయపడ్డారు. మృతుల్లో హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అర్జున్కుమార్ (37), అతని భార్య (32), బివాన్ (4), దీక్షిత్ (9), అనితా రాజు (40), శివకుమార్ (35), రవళి (30)తో పాటు మరొకరు ఉన్నారు. మృతులు, క్షతగాత్రులను హైదరాబాద్ బొల్లారంలోని రిసాలబజార్కు చెందిన వారిగా గుర్తించారు.
పుట్టినరోజు వేడుకల కోసం రెండు కుటుంబాలకు చెందిన 32 మంది గోవాకు వెళ్లారు. వీరిలో 21 మంది ఓ కుటుంబం.. 11 మంది మరో కుటుంబం. తిరుగు ప్రయాణంలో బస్సు గోవా నుంచి హైదరాబాద్కు వస్తుండగా శ్రీరంగపట్నం-బీదర్ హైవేపై ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్, ఇద్దరు సహాయకులు సహా మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను స్థానికులు రక్షించి కలబురిగి పరిధిలోని మూడు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు.
బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్
కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరి రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?