Road Accident: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురి దుర్మరణం

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం జరిగింది. యాదగిరి జిల్లాలో ఆగిఉన్న లారీని జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.

Updated : 06 Jun 2023 09:28 IST

కలబురిగి: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం జరిగింది. యాదగిరి జిల్లాలో ఆగిఉన్న లారీని జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. మృతులను నంద్యాల జిల్లా వెలుగోడు వాసులుగా గుర్తించారు.  కలబురిగిలోని దర్గా ఉరుసు జాతరకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను మునీర్‌(40), నయామత్‌(40), రమీజా బేగం(50), ముద్దత్‌ షీర్‌ (12), సుమ్మి(13)గా గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని