Kothagudem: బొగ్గు లారీ ఢీ.. పల్టీలు కొట్టి ఆర్టీసీ బస్సు బోల్తా

ద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. టీఎస్‌ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది.

Updated : 30 Apr 2023 08:19 IST

కొత్తగూడెం పట్టణం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. టీఎస్‌ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో 43 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం భద్రాచలం డిపో నుంచి 47 మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు విజయవాడ బయల్దేరింది. చుంచుపల్లి మండలం ఆనందగని వద్ద రోడ్డుకు అడ్డంగా బొగ్గు లారీ అతివేగంతో వచ్చి బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు రెండు పల్టీలు కొట్టి బోల్తాపడింది.

బస్సులోని ప్రయాణికుల్లో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కొత్తగూడెంలోని జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో విజయవాడ, నూజివీడు, భద్రాచలం, కొత్తగూడెం పట్టణాలకు చెందిన వారు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని