Mahbubnagar: లారీ బీభత్సం: వ్యక్తి మృతి.. కాలేజీ విద్యార్థులకు గాయాలు

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం లారీ బీభత్సం సృష్టించింది.

Published : 24 Apr 2023 10:03 IST

మహబూబ్‌నగర్‌ (నేరవిభాగం): మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం లారీ బీభత్సం సృష్టించింది. రెండో పట్టణ ఠాణా సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో ప్రతిభా జూనియర్‌ కళాశాలకు చెందిన బస్సు  కొంతమంది విద్యార్థులతో కళాశాలకు వస్తోంది. ఈ  క్రమంలో ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి ఎదురుగా రహదారిపై మలుపు తిరుగుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది.

అదే సమయంలో  ద్విచక్రవాహనంపై రోడ్డు దాటుతున్న సత్యనారాయణ అనే  వ్యక్తిని  లారీ ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కళాశాల బస్సులో ఉన్న విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.  ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని