Andhra News: నగరిలో బైక్‌, లారీ దగ్ధం.. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన రాకపోకలు

చిత్తూరు జిల్లా నగరిలో ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ  ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.  

Updated : 24 May 2022 23:22 IST

నగరి: చిత్తూరు జిల్లా నగరిలో ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ  ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.  ఈ ఘటనలో ద్విచక్రవాహనాన్నిలారీ 300 మీటర్ల వరకు   లాక్కెళ్లింది. దీంతో మంటలు అంటుకుని బైక్‌, లారీ రెండూ దగ్ధం అయ్యాయి. ఈ ఘటనతో ట్రాఫిక్‌కు అంతరాయయం ఏర్పడింది. తిరుపతి-చెన్నై జాతీయరహదారిపై భారీగా రాకపోకలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయచర్యలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని