Andhra News: వంతెన పైనుంచి కిందపడిన కారు: ఒకరి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వరికుంటపాడు వద్ద పైవంతెన

Updated : 22 Mar 2022 09:31 IST

వరికుంటపాడు: నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వరికుంటపాడు వద్ద పైవంతెన నుంచి కారు కిందపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వరికుంటపాటు కోల్డ్‌ స్టోరేజ్‌ వద్ద వంతైన పైనుంచి కింద పడిన కారులో డ్రైవర్‌ సహా ముగ్గురు ఉన్నారు.

ప్రమాదంలో పామూరుకు చెందిన వెంకటలక్ష్మమ్మ కారులోనే మృతిచెందారు. డ్రైవర్‌తో పాటు మరో యువతికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని