Road Accident: నెల్లూరు జిల్లాలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బోల్తా

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కండ్రిక వద్ద ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది.

Updated : 26 Apr 2022 06:29 IST

నెల్లూరు: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కండ్రిక వద్ద ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలు అయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. ట్రావెల్స్‌ బస్సు బళ్లారి నుంచి నెల్లూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు బస్సు అద్దాలను పగలగొట్టి పలువురుని కాపాడారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని