Ap News: నలుగురిని చిదిమేసిన లారీ
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరు-మనుబోలు మధ్య జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొట్టింది. తిరుమల శ్రీవారిని దర్శించుకొని కాకినాడు తిరిగి వెళ్తుండగా.. గూడూరు-మనుబోలు
గూడూరు గ్రామీణం, మనుబోలు: దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన నెల్లూరు జిల్లా మనుబోలు-గూడూరు సరిహద్దు ప్రాంతంలోని చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం సంపర గ్రామానికి చెందిన మాజీ సర్పంచి తిబిరిశెట్టి వీరన్న అలియాస్ దొరబాబు(55), ఆయన భార్య శ్రీవరలక్ష్మి(48), కుమార్తె లిఖిత కాకినాడలోని జగన్నాథపురంలో నివాసముంటున్నారు. తిరుమలకు వెళ్లేందుకు సమీప బంధువులు మణికంఠ(37), ఆయన భార్య స్వాతి(32)తో కలిసి కారులో తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం తిరుగు ప్రయాణమయ్యారు.
అప్పటికే మనుబోలు-గూడూరు సరిహద్దు ప్రాంతం వద్ద వంతెన నిర్మాణ పనులు జరుగుతుండటంతో స్పీడ్ బ్రేకర్లను వేశారు. వేగాన్ని నియంత్రించే క్రమంలో ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో లారీ వెనక ఉన్న కారు కూడా నిలిచిపోయింది. అదే సమయంలో అతి వేగంగా వస్తున్న మరో లారీ ఆగి ఉన్న కారును వెనుక నుంచి వేగంగా ఢీకొనడంతో రెండు లారీల మధ్య కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ఉన్న మణికంఠ, వీరన్న, శ్రీవరలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఇరుక్కుపోయిన స్వాతి, లిఖితను భారీ యంత్రాల సాయంతో బయటకు తీశారు. ఇద్దరినీ 108 వాహనంలో నెల్లూరుకు తరలించే క్రమంలో మార్గమధ్యంలో స్వాతి మృతిచెందగా.. లిఖిత నెల్లూరు జీజీహెచ్లో చికిత్స పొందుతుంది. లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత రహదారిపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. మనుబోలు, చిల్లకూరు, గూడూరు గ్రామీణం, పట్టణ ఎస్సైలు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్ను పునరుద్ధరించారు. గూడూరు గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను క్రేన్, జేసీబీ సాయంతో అతికష్టం మీద బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ