Road Accident: బైక్‌ను ఢీకొట్టిన కారు.. దంపతులతో సహా చిన్నారి మృతి

నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో

Updated : 10 May 2022 11:16 IST

కమ్మర్‌పల్లి: నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దంపతులతో పాటు చిన్నారి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కమ్మర్‌పల్లికి చెందిన కృష్ణయ్య, రజిత దంపతులు అర్ధరాత్రి తమ ఇద్దరు కుమార్తెలతో బైక్‌పై సమీప గ్రామానికి బయల్దేరారు. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులతో పాటు పెద్ద కుమార్తె రాఘవి ఘటనాస్థలిలోనే మృతిచెందింది. చిన్న కుమార్తె శరణ్యకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని