Road Accident: సూర్యాపేట జిల్లాలో అతివేగంతో బైకులు ఢీ: నాలుగుకి చేరిన మృతులు

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం నశీంపేట వద్ద గురువారం అర్ధరాత్రి సమయంలో

Published : 11 Feb 2022 11:14 IST

ఆత్మకూర్‌(ఎస్‌): సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం నశీంపేట వద్ద గురువారం అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 4కి చేరింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతివేగంతో ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలంలోనే ముగ్గురు మృతిచెందగా మరొకరు ఈ ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తెట్టెకుంటతండాకు చెందిన బాణోతు అరవింద్‌ (20), భోట్యతండాకు చెందిన భూక్య నవీన్‌ (23), చివ్వెంల మండలం లక్ష్మణ్‌నాయక్‌తండాకు చెందిన ధరావత్‌ ఆనంద్‌ (22) ఘటనాస్థలంలో మృతిచెందగా.. ఆస్పత్రిలో ఏపూర్‌ తండాకు చెందిన వినేశ్‌ మరణించారు. మృతులంతా 25 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. మృతదేహాలను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని