Crime News: తిరుమల ఘాట్‌ రోడ్డులో మినీ ట్రక్కు బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు

తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో మినీ ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

Published : 23 Jan 2023 20:25 IST

తిరుమల: తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో  ప్రమాదం జరిగింది. కనుమదారిలోని 9వ మలుపు వద్ద కొబ్బరి చిప్పలు తీసుకువస్తున్న ఓ మినీ ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఘాట్‌రోడ్డు భద్రతా సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమల నుంచి సరకు రవాణా వ్యాన్‌లో డ్రైవర్‌ యువరాజు, మరో వ్యక్తి చంద్రతో కలిసి తిరుపతికి బయలుదేరారు. మొదటి ఘాట్‌రోడ్డు 9వ మలుపురాగానే వ్యాన్‌ వేగంగా రక్షణ గోడను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ఇతర వాహనాల్లోని భక్తులు క్షతగాత్రులను గుర్తించి అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంపై తిరుమల ట్రాఫిక్‌ పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని