Andhra News: కళాకారుల వాహనానికి ప్రమాదం.. ముగ్గురి మృతి
విశాఖలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొని తిరుగు
తుని: విశాఖలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొని తిరుగు ప్రయాణమైన కళాకారుల వాహనం తుని వద్ద ప్రమాదానికి గురైంది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. రాజమహేంద్రవరానికి చెందిన కొందరు కళాకారులు విశాఖలో ఏటా నిర్వహించే వినాయక నిమజ్జన ఊరేగింపులో నాటకాలు వేస్తుంటారు. ఈ ఏడాది కూడా విశాఖలోని భీశెట్టి వారి వీధి వద్ద ఏర్పాటు చేసిన వినాయక చవితి ముగింపు ఉత్సవాల్లో వీరి బృందం ప్రదర్శన ఇచ్చింది. 10 మంది సభ్యులు, అఘోరా, శివుడు, పార్వతి, వివిధ వేషధారణలు వేసి స్థానికులను మెప్పించారు.
ప్రదర్శన ముగించుకుని రాజమహేంద్రవరం వస్తుండగా ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో తుని వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రీవెడ్డింగ్ ఫంక్షన్లో వివాదం..యువకుడిని టెర్రస్పై నుంచి తోసేసిన వ్యాపారవేత్త
ఓ ప్రీవెడ్డింగ్ వేడుకలో సరదాగా గడుపుతున్న సమయంలో యువకుల మధ్య జరిగిన చిన్న వివాదం ఓ వ్యక్తికి ప్రాణాంతకంగా మారింది. -
బాలుడిని చంపేసి.. ఆత్మహత్య చేసుకుని..!
చోరీ చేసి.. డబ్బులు పంచుకునే క్రమంలో జరిగిన గొడవలో ఓ యువకుడు బాలుడిని హత్య చేసి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
హైదరాబాద్లో అమానుషం.. మహిళపై ఇద్దరు యువకుల అత్యాచారం
చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే ఓ మహిళ.. తెల్లవారుజామున ఇద్దరు యువకుల కంటపడింది. కన్నూమిన్నూ కానకుండా వారు ఆమెపై పాశవికంగా లైంగికదాడికి పాల్పడ్డారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ విద్యార్థుల దుర్మరణం
అమెరికాలో శనివారం రాత్రి(భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు తెలంగాణ విద్యార్థులను బలిగొంది. -
పవన్ సభలో చాకుతో యువకుడు
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ వారాహి విజయభేరి యాత్రలో భాగంగా భీమవరం ప్రకాశం చౌక్లో ప్రసంగిస్తున్న సమయంలో ఇద్దరి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
ట్రక్కును ఢీకొట్టిన కారు.. రాజస్థాన్లో 9 మంది మృతి
పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఓ కారు ట్రక్కును ఢీకొనడంతో తొమ్మిది మంది మరణించారు. రాజస్థాన్లోని ఝలావాఢ్లో ఆదివారం ఈ ప్రమాదం సంభవించింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు నేత మృతి
ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లా కేస్కుతుల్-కేశముండి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆదివారం ఓ మావోయిస్టు నేత మృతి చెందాడు. -
వార్డు సచివాలయంలో పట్టుబడ్డ మద్యం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వార్డు సచివాలయంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. -
చంద్రబాబు సభకు వెళ్లారని హత్యాయత్నం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో శనివారం జరిగిన చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లాడనే అక్కసుతో తెదేపా కార్యకర్తపై వైకాపా మద్దతుదారులు హత్యాయత్నానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
డీప్ఫేక్ వీడియోపై రణ్వీర్ సింగ్ పోలీస్ కేసు
-
ఎంపీ అభ్యర్థి మాధవీలతతో ఏఎస్సై ఆలింగనం.. సస్పెండ్ చేసిన సీపీ
-
‘ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్’ వ్యవస్థ ధరనూ కుదించిన టెస్లా
-
కోర్సు ఎందుకు.. హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేయండి: సుప్రీం ఆగ్రహం
-
ఏఐకి డేటా కంటే విలువైనది ఇదే.. మార్క్ జుకర్బర్గ్ అంచనా!
-
కవితకు బెయిల్ ఇవ్వొద్దు: సీబీఐ