కారులోనే ఐదుగురి సజీవదహనం

ఉత్తరప్రదేశ్‌లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారులో మంటలు చెలరేగడంతో ఐదుగురు సజీవ దహనమయ్యారు.పోలీసుల కథనం ప్రకారం.

Published : 22 Dec 2020 11:40 IST


 

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారులో మంటలు చెలరేగడంతో ఐదుగురు సజీవ దహనమయ్యారు.పోలీసుల కథనం ప్రకారం...యమునా ఎక్స్‌ప్రెస్‌ వేపై రాంగ్‌రూట్‌లో వస్తున్న ఓ కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో మంటలు చెలరేగి అందులోని ఐదుగురు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్‌ నాగాలాండ్‌ నుంచి వచ్చినట్లు గుర్తించిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. 

 

ఇవీ చదవండి..
పెళ్లిపీటలు ఎక్కకుండానే.. ప్రాణాలు పోయాయ్‌

ఆమెది ఆత్మహత్యే
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు