Andhra News: రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం గౌరీపురం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.

Updated : 10 Apr 2022 23:30 IST

శృంగవరపుకోట: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం గౌరీపురం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపక్కన ఆగి ఉన్న రెండు ద్విచక్రవాహనాలను వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఎస్‌.కోట పట్టణంలో ఏవీ హోమ్స్‌లో నివాసముంటున్న కిల్లో సోనాపతి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ద్విచక్రవాహనంపై స్వగ్రామం అనంతపురంలోని కోనాపురం బయలుదేరాడు. మార్గంమధ్యలో గౌరీపురం సమీపంలో రోడ్డు పక్కన తాటిముంజలు కొనేందుకు వాహనాన్ని ఆపాడు. అదే సమయంలో అరకు వైపు నుంచి వేగంగా వస్తోన్న కారు అదుపుతప్పి వీరితో పాటు మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో సోనాపతి, ఆయన భార్య శ్రావణి తీవ్రంగా గాయపడగా పిల్లలు శ్రావణ్‌(6), సువాస్‌(3) అక్కడికక్కడే మృతి చెందారు. పక్కనే ఉన్న ద్విచక్రవాహనంపై ఉన్న పెద్దకండేపల్లికి చెందిన అప్పారావు, అతని తమ్ముడు కూతురు ఐదేళ్ల సుచిత తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురిని ఎస్‌.కోట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోనాపతి మృతి చెందాడు. ఎస్‌.కోట ఎస్సై తారకేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని