Road Accident: కారు-డీసీఎం వాహనం ఢీ: నలుగురి దుర్మరణం
హైదరాబాద్- శ్రీశైలం తుమ్మలూరు గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును డీసీఎం వాహనం ఢీకొట్టడంతో నలుగురు మృతిచెందారు.
మహేశ్వరం: హైదరాబాద్- శ్రీశైలం తుమ్మలూరు గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును డీసీఎం వాహనం ఢీకొట్టడంతో నలుగురు మృతిచెందారు. మృతులను నాగర్కర్నూలు జిల్లా వెల్దండ మండలం పోతేపల్లికి చెందిన బైకని యాదయ్య (35), ముంత శ్రీనివాసులు (35), ఇమ్మరాసి రామస్వామి (36), హనుమంతు కేశవులు (33)గా గుర్తించారు. వీరు వివిధ బృందాలుగా ఏర్పడి శుభకార్యాల్లో వంటలు చేస్తూ ఉపాధి పొందేవారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి హైదరాబాద్లోని ఓ శుభకార్యంలో వంటలు చేసి తిరిగొస్తుండగా శుక్రవారం ఉదయం తుమ్మలూరు గేట్ సమీపంలోని మ్యాక్ ప్రాజెక్టు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?