Crime News: తక్కువ ధరకే బంగారం.. బాపట్లలో ఘరానా మోసం

గుంటూరు జిల్లా బాపట్లలో ఘరానా ముఠా చేతివాటాన్ని ప్రదర్శించింది. తక్కువ ధరకే బంగారం

Published : 16 Jan 2022 08:30 IST

బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్లలో ఘరానా ముఠా చేతివాటాన్ని ప్రదర్శించింది. తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పి మోసం చేసింది. తక్కువ ధరకే బంగారం వస్తుందని ముఠా చేసిన ప్రచారాన్ని చూసిన తెలంగాణకు చెందిన ఇద్దరు బంగారు వ్యాపారులు గుంటూరు వచ్చారు. గుంటూరు జిల్లా బాపట్లలోని బేతిపూడి వద్దకు వచ్చిన వ్యాపారులపై ఈ ముఠా దాడి చేసి వారి వద్దనున్న రూ. 30 లక్షలు లాక్కెళ్లింది. దీంతో బాధితులు వెదుళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని