Andhra news: ఆర్టీసీ బస్సు బోల్తా.. మహిళ మృతి..

నెల్లూరు జిల్లా మనుబొలు జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ సమయంలో 35 మంది ప్రయాణీకులు ఉండగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక మహిళ మృతి చెందింది.

Published : 10 May 2022 13:23 IST

నెల్లూరు: నెల్లూరు జిల్లా మనుబొలు జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు.  మృతురాలిని నెల్లూరు జిల్లా కోవూరు మండలం లేగుంటపాడుకు చెందిన కరీమాగా గుర్తించారు. బాధితులను గూడూరు ఏరియా ఆసుపత్రకి తరలించారు. క్షతగాత్రుల్లో కొంత మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు మనుబోలు సమీపంలోకి రాగానే టైర్ పంక్చర్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ సమయంలో రహదారి పక్కనే విద్యుత్తు స్తంబం ఉండటంతో బస్సు మరో మారు పల్టీ కొట్టకుండా ఆగిందని కండక్టర్‌ హసీఫుద్దీన్‌ తెలిపాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని