Crime News: బాగా చదివి లాయర్ కావాలనుకుని.. ఉన్మాది చేతిలో కత్తి పోట్లకు బలైపోయింది
ఆస్పత్రిలో అచేతనంగా పడి ఉన్న కూతురు మృతదేహాన్ని చూసి ఆమె తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో బతుకుతున్న కూతురు లేదనే నిజం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది.
దిల్లీ: తల్లిదండ్రులు ఇద్దరు రోజువారీ కూలీలు. వారు తమ కోసం పడుతున్న కష్టాన్ని చూసి ఆ యువతి బాగా చదివి జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలనుకుంది. దానికి తగినట్లుగానే పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఆ ఆనందాన్ని కుంటుంబ సభ్యులతో పంచుకుంటూ భవిష్యత్తులో న్యాయవాదిగా కావాలన్న తన కలను తండ్రితో చెప్పింది. కానీ, అప్పటికి ఆమెకు తెలియదు మృత్యువు తన స్నేహితుడి రూపంలో ఎదురుచూస్తుందని. ఎంతో ఆనందంతో స్నేహితురాలి ఇంట్లో పుట్టినరోజు వేడుకకు బయలుదేరిన బాలికను వెంబడించిన ఉన్మాది ఆమెపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 20 సార్లు కత్తితో పొడిచి, బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. ఆదివారం దిల్లీ రోహిణి ప్రాంతంలోని షాబాద్ డెయిరీ ప్రాంతానికి చెందిన సాక్షి అనే పదహారేళ్ల బాలిక ఆశయం గురించి ఆమె తండ్రి ఆవేదనతో చెప్పిన మాటలు ఇవి..
ఆస్పత్రిలో అచేతనంగా పడి ఉన్న సాక్షి మృతదేహాన్ని చూసి ఆమె తండ్రి జనక్రాజ్ కన్నీరుమున్నీరుగా విలపించారు. నిందితుణ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కానీ, పోలీసులు మాత్రం సాక్షికి, నిందితుడు సాహిల్ గత కొంత కాలంగా రిలేషన్షిప్లో ఉన్నారని, శనివారం వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగిందని చెబుతున్నారు. ఆదివారం పుట్టినరోజు వేడుక కోసం బయటకు వచ్చిన సాక్షిని అనుసరించి ఆమెతో మరోమారు సాహిల్ వాగ్వివాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఆమెను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. సాక్షి తల్లిదండ్రులు మాత్రం నిందితుడికి, తమ కుమార్తెకు మధ్య ఉన్న స్నేహం గురించి తమకు తెలియదని అంటున్నారు.
సాక్షి హత్యతో దిల్లీలోని షాబాద్ డెయిరీ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గత కొంతకాలంగా ఆకతాయిలు ఆకృత్యాలు ఈ ప్రాంతంలో పెరిగిపోయాయని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికుడు ఒకరు వాపోయారు.
ఈ వ్యవహారం మొత్తం అక్కడి సీసీటీవీల్లో (CCTV) రికార్డు అయ్యింది. వీధిలో జరుగుతున్న ఈ దారుణాన్ని పలువురు చూసుకుంటూ వెళ్తున్నప్పటికీ, ఎవ్వరూ అతడిని నిలువరించడానికి ప్రయత్నించలేదు. ఓ వ్యక్తి తమ కుమార్తెపై దాడిని అడ్డుకునేందుక ప్రయత్నించగా అతనిపై కూడా దాడి చేసినట్లు సాక్షి తండ్రి చెప్పారు. ప్రస్తుతం గాయాలతో ఉన్న అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు షాబాద్ డెయిరీ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యవతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడి అరెస్టు చేశారు.
మరోవైపు ఈ ఘటనను దిల్లీ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. దిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మాలివాల్ ట్విటర్లో స్పందించారు. ‘‘దిల్లీ షాబాద్ డెయిరీ వద్ద ఓ అమాయక బాలిక హత్యకు గురైంది. దిల్లీలో నేరగాళ్లకు అడ్డూ అదుపులేకుండా పోయింది. దీనిపై పోలీసులకు నోటీసులు జారీ చేశాము. అన్ని హద్దులను దాటేశారు. నా కెరీర్లో ఇంత ఘోరాన్ని నేను చూడలేదు’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు