YouTube: యూట్యూబ్ వీడియోలు లైక్ చేస్తే నగదు.. వెలుగులోకి నయా సైబర్ మోసం!
ప్రస్తుతం చాలా మందికి యూట్యూబ్ (YouTube) ఒక ఆదాయవనరుగా మారిపోయింది. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) సరికొత్త మోసానికి తెరలేపారు. వారి చెప్పిన మాయమాటలు నమ్మి ఓ వ్యక్తి రూ. 8.5 లక్షల నగదు పోగొట్టుకున్నాడు.
దిల్లీ: ఎంటర్టైన్మెంట్లో కొత్తదనం కోరుకునే వారికి యూట్యూబ్ (YouTube) వేదికగా ఎన్నో రకాల వీడియోలు, షార్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి షార్ట్స్ చూడటం మొదలు పెడితే.. అలా స్వైప్ చేస్తూ ఒకదాని తర్వాత మరొకటి అంటూ చూస్తూనే ఉండిపోతాం. ప్రస్తుతం చాలా మందికి యూట్యూబ్ ఒక ఆదాయవనరుగా మారిపోయింది. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) సరికొత్త మోసానికి తెరలేపారు. యూట్యూబ్లో వీడియోలను లైక్ చేస్తే నగదు బహుమతి ఇస్తామని అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా గురుగ్రామ్ (Gurgram)కు చెందిన ఓ వ్యక్తి సైబర్ మోసాగాళ్ల వలలో పడి రూ. 8.5 లక్షల నగదు పోగొట్టుకున్నాడు.
ఏం జరిగిందంటే?
గురుగ్రామ్కు చెందిన సిమ్రన్జీత్ సింగ్ నందా అనే వ్యక్తికి కొద్ది రోజుల క్రితం వాట్సాప్లో ఓ మెసేజ్ వచ్చింది. యూట్యూబ్లో తాము చెప్పిన వీడియోలను లైక్ చేస్తే.. ప్రతి లైక్కు రూ. 50 చెల్లిస్తామనేది సదరు మెసేజ్ సారాంశం. ఇదో గొప్ప ఆదాయమార్గమని ఆశ చూపించడంతో సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు చేసేందుకు అంగీకరించాడు. తర్వాతి రోజు నందాకు ఓ మహిళ ఫోన్ చేసి యూట్యూబ్లో లైక్స్ ఒప్పందంలో భాగంగా వ్యాపారపరమైన నిర్వహణ ఖర్చుల నిమిత్తం కొంత నగదు జమ చేయాలని కోరింది. నగదును ట్రాన్స్ఫర్ చేసేందుకు నగదు రిక్వెస్ట్ పంపుతున్నామని చెప్పింది. ఆమె పంపిన రిక్వెస్ట్పై క్లిక్ చేసిన తర్వాత విడతల వారీగా రూ. 8.5 లక్షల నగదు తన ఖాతా నుంచి ట్రాన్స్ఫర్ అయినట్లు నందా గుర్తించాడు. దీనిపై మెసేజ్ పంపిన వారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా అవతలి వైపునుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటి వరకు నమోదైన సైబర్ మోసాల్లో ఇది కొత్త తరహా మోసమని పోలీసులు తెలిపారు.
యూట్యూబ్ వీడియోలతో మాల్వేర్ వ్యాప్తి
యూట్యూబ్ ద్వారా మరో సైబర్ మోసం కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో రూపొందించిన వీడియోల ద్వారా మాల్వేర్ను వ్యాప్తి చేస్తున్నారు. ట్యుటోరియల్ వీడియోల పేరుతో యూజర్లను ఆకర్షించి.. ఫొటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆటోడెస్క్ 3డీఎస్ మ్యాక్స్, ఆటోక్యాడ్ వంటి సాఫ్ట్వేర్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో వివరిస్తాం అని డెస్క్రిప్షన్లో పేర్కొంటారు. యూజర్లు వీడియోలపై క్లిక్ చేసిన తర్వాత కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేయాలని సూచిస్తారు. సదరు లింక్పై క్లిక్ చేసిన తర్వాత వారి డివైజ్లలోకి మాల్వేర్ డౌన్లోడ్ అవుతుంది. తర్వాత యూజర్ ప్రమేయం లేకుండా సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారం, ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించిన యాప్ల వివరాలు వంటివి సేకరిస్తున్నారని క్లౌడ్సెక్ (CloudSEK) అనే సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ హెచ్చరించింది. యూజర్లు సదరు వీడియోల పట్ల అప్రమత్తతో ఉండాలని హెచ్చరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బస్సు ఢీకొని.. నలుగురు ఇంటర్ విద్యార్థుల దుర్మరణం
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!