Crime News: హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యానికి మూల్యం.. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి
ప్రమాదవశాత్తూ పాఠశాల ఆవరణలో ఉన్న బావిలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది..
తిమ్మాపూర్: ప్రమాదవశాత్తూ పాఠశాల ఆవరణలో ఉన్న బావిలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లాలోని జూలపల్లి మండలం తేలుకుంట గ్రామానికి చెందిన రాధా, శ్రీనివాస్ దంపతులకు ఇద్దరు సంతానం. శ్రీనివాస్ హైదరాబాద్లో డ్రైవింగ్ స్కూల్ నిర్వహిస్తూ అక్కడే తన భార్య, కుమార్తెతో ఉంటున్నారు. కుమారుడు మారం శ్రీకర్(13) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణకాలనీలో అమ్మమ్మ పర్యవేక్షణలో ఎల్ఎండీ కాలనీలోని సెయింట్ ఆంథోని ప్రైవేటు పాఠశాల హాస్టల్లో ఉంటూ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం పాఠశాల ఆవరణలోని బావిలో చెత్తను తొలగించాలంటూ శ్రీకర్తోపాటు మరో ఐదుగురు విద్యార్థులను వసతిగృహం వార్డెన్ బావిలోకి దింపాడు. చెత్తను తొలగించిన అనంతరం ఐదుగురు విద్యార్థులు బయటకు రాగా, శ్రీకర్ ప్రమాదవశాత్తు బావిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సుమారు గంట పాటు శ్రమించి శ్రీకర్ మృతదేహాన్ని బావి నుంచి వెలికితీశారు. విద్యార్థి మునిగిపోవడం గమనించిన తోటి విద్యార్థులు గట్టిగా కేకలు వేయడంతో భయపడిపోయిన పాఠశాల వార్డెన్ అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడా అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. పాఠశాల విద్యార్థులను బావిలోకి దించి పనులు చేయించడం.. దీని వల్ల విద్యార్థి ప్రాణాలు పోయాయని విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగాయి. శ్రీకర్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM