బిహార్లో కీచక ప్రిన్సిపల్కు ఉరిశిక్ష
పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న పదకొండేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో ఓ కీచక ప్రిన్సిపల్కు ఉరిశిక్ష పడింది. ఈ ఘటన బిహార్లోని పట్నాలో చోటుచేసుకుంది.......
సహకరించిన ఉపాధ్యాయుడికి జీవితఖైదు
పట్నా: పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న పదకొండేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో ఓ కీచక ప్రిన్సిపల్కు ఉరిశిక్ష పడింది. ఈ ఘటన బిహార్లోని పట్నాలో చోటుచేసుకుంది. నిందితుడికి సహకరించిన మరో ఉపాధ్యాయుడికి కోర్టు జీవితఖైదు విధించింది. పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి అవధేశ్ కుమార్ ఈ మేరకు తీర్పును వెలువరించారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. ఫుల్వారీ షరీఫ్ ప్రాంతానికి చెందిన బాధిత బాలిక ఓ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. 2018 సెప్టెంబరులో బాధిత చిన్నారి తరచూ అనారోగ్యం పాలవుతుండటంతో ఆమె తల్లిదండ్రులు వైద్య పరీక్షలు చేయించారు. అప్పుడు ఆ బాలిక గర్భవతి అని నిర్ధరణ కావడంతో అసలు విషయం బయటపడింది. దీంతో సమీప మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలిక చదువుతున్న పాఠశాల ప్రిన్సిపల్ అరవింద్ కుమార్ ఆమెపై అత్యాచారం చేయగా, మరో ఉపాధ్యాయుడైన అభిషేక్ కుమార్ ఈ దుశ్చర్యకు సహకరించాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రిన్సిపల్, టీచర్ను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి నేడు పట్నాలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం కోర్టు ప్రిన్సిపల్కు మరణశిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించింది. అలాగే, అతడికి సహకరించిన ఉపాధ్యాయుడికి రూ.50వేల జరిమానా, జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.