ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే ‘అలా’ చేయమని కాదు..!
ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినంత మాత్రాన.. అది లైంగిక సంబంధం పెట్టుకోవడానికి, వేధింపులకు గురిచేయడానికి అనుమతి ఇచ్చినట్లు కాదని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు వెల్లడించింది. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి బెయిల్పై కోర్టులో తాజాగా విచారణ జరిగింది. బాధితురాలే
సిమ్లా: ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినంత మాత్రాన.. అది లైంగిక సంబంధం పెట్టుకోవడానికి, వేధింపులకు గురిచేయడానికి అనుమతి ఇచ్చినట్లు కాదని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి బెయిల్పై కోర్టులో తాజాగా విచారణ జరిగింది. బాధితురాలే ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిందని, బాలిక తన వయసు గురించి తప్పుడు సమాచారం ఇచ్చిందని నిందితుడి తరఫు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించాడు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి .. ‘‘నెటిజన్లు సోషల్మీడియాలో తమ గుర్తింపును గోప్యంగా ఉంచడం సహజమే. ఫ్రెండ్ రిక్వెస్ట్ అనేది నిందితుడు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి అనుమతి కాదు’’అని వ్యాఖ్యానించారు. నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. సోషల్ మీడియా వినియోగించడమనేది ఒక సంప్రదాయంగా మారిపోయిందని.. ఇది పరిధిని పెంచుకోవడానికి, జ్ఞానం, వినోదం పొందడానికే గానీ.. మానసిక, లైంగిక వేధింపులకు గురిచేయడానికి కాదని న్యాయమూర్తి హితవు పలికారు.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం