Crime news: ‘మహా’లో మరో విషాదం.. అత్యాచార అవమానం తట్టుకోలేక బాలిక ఆత్మహత్య

అత్యాచార అవమానం తట్టుకోలేక ఓ బాలిక(17) శనివారం తనువు చాలించింది. ఈ ఘటన అమరావతి జిల్లాలోని.....

Published : 12 Sep 2021 01:08 IST

ముంబయి: మానవ మృగాల పైశాచికత్వానికి ఓ మహిళ బలైన కొద్ది గంటలకే మహారాష్ట్రలో మరో విషాదం చోటుచేసుకుంది. అత్యాచార అవమానం తట్టుకోలేక ఓ బాలిక(17) శనివారం తనువు చాలించింది. ఈ ఘటన అమరావతి జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. బాలిక కుటుంబానికి బంధువైన ఓ వ్యక్తి (24) తరచూ వారి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలోనే అతడు బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి. విషయం కుటుంబసభ్యులతోపాటు బయట కూడా తెలియడంతో అవమానం భరించలేని ఆ బాలిక ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

ముంబయి మహానగరంలో గురువారం అర్ధరాత్రి నిర్భయ తరహా ఘటన చోటుచేసుకుంది. సాకినాక శివారు ప్రాంతంలో ఓ మహిళ(34)పై కొందరు దుర్మార్గులు అత్యంత కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. అత్యాచారం చేసి, బాధితురాలి రహస్య అవయవాలపై ఇనుప రాడ్డుతో దాడి చేశారు. అనంతరం నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. రక్తపుమడుగులో ఉన్న ఆ మహిళను గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలువిడిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు