మద్యం దొరక్క శానిటైజర్‌ తాగి ఏడుగురి మృతి!

మహారాష్ట్రలోని యావత్మల్‌ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం దొరక్క శానిటైజర్‌ తాగి ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 25 Apr 2021 12:20 IST

ముంబయి: మహారాష్ట్రలోని యావత్మల్‌ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం దొరక్క శానిటైజర్‌ తాగి ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యావత్మల్‌ జిల్లాలోని వాణి ప్రాంతానికి చెందిన ఏడుగురు వ్యక్తులు మద్యానికి బానిసయ్యారు. ప్రస్తుతం మద్యం దొరక్కపోవడంతో సదరు వ్యక్తులు హ్యాండ్‌ శానిటైజర్‌ను తాగారు. దీంతో ఆ ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారంతా కూలీలుగా పోలీసులు ధ్రువీకరించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని