Bike Stunt: శక్తిమాన్ తరహాలో బైక్ స్టంట్.. ఊచలు లెక్కిస్తున్న యువకులు
వాహనం చేతిలో ఉంటే చాలు.. కొందరు యువకులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ప్రమాదకర రీతిలో స్టంట్లకు పాల్పడుతున్నారు......
నొయిడా: వాహనం చేతిలో ఉంటే చాలు.. కొందరు యువకులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ప్రమాదకర రీతిలో స్టంట్లకు పాల్పడుతున్నారు. మొన్నటికిమొన్న ఉత్తర్ప్రదేశ్లోని నొయిడాకు చెందిన ఓ వ్యక్తి రెండు ఎస్యూవీ కార్లపై అజయ్ దేవ్గణ్ స్టైల్లో స్టంట్లు చేసి పోలీసులకు చిక్కగా.. తాజగా అదే ప్రాంతానికి చెందిన యువకుడు బైక్ స్టంట్కు పాల్పడి జైలుపాలయ్యాడు. వికాస్ అనే వ్యక్తి శక్తిమాన్ తరహాలో బైక్పై పడుకొని ఈ స్టంట్ చేశాడు. కాగా వికాస్తోపాటు వీడియో తీసిన అతడి ఇద్దరు మిత్రులను కూడా అరెస్టు చేసినట్లు గౌతమ్బుద్ధ నగర్ పోలీసులు వెల్లడించారు.
కొద్దిరోజుల క్రితం నొయిడాకే చెందిన రాజీవ్ అనే యువకుడు బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గణ్ స్టైల్లో కారు స్టంట్ చేసి కటకటాలపాలయ్యాడు. పోలీసులు రెండు ఎస్యూవీ కార్లు, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. అజయ్ దేవ్గణ్ ‘ఫూల్ ఔర్ కాంటే’ సినిమాలో రెండు బైకులపై, గోల్మాల్-3లో రెండు కార్లపై నిల్చొని ఎంట్రీ ఇస్తాడు. రాజీవ్ అనే యువకుడు సైతం అదే తరహా స్టంట్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ఈ స్టంట్లకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారడంతో అప్రమత్తమైన పోలీసులు రాజీవ్ను అదుపులోకి తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.