Shalu Chourasiya: పొదల్లోకి తోసి లైంగిక దాడికి యత్నించాడు
కేబీఆర్ పార్క్లో దుండగుడు నాపై తీవ్రంగా దాడి చేశాడు... తలను బండరాయికి కొట్టడంతో తీవ్రగాయమై నేను స్పృహ కోల్పోయాను. పొదల్లోకి తోసి నాపై లైంగిక దాడికి యత్నించగా స్పృహ వచ్చింది. తీవ్రంగా ప్రతిఘటించి తప్పించుకున్నాను.
షాలూ చౌరాసియా
మాదాపూర్, న్యూస్టుడే: కేబీఆర్ పార్క్లో దుండగుడు నాపై తీవ్రంగా దాడి చేశాడు... తలను బండరాయికి కొట్టడంతో తీవ్రగాయమై నేను స్పృహ కోల్పోయాను. పొదల్లోకి తోసి నాపై లైంగిక దాడికి యత్నించగా స్పృహ వచ్చింది. తీవ్రంగా ప్రతిఘటించి తప్పించుకున్నాను. నా కాలు కూడా విరిగిందంటూ సినీనటి షాలూ చౌరాసియా ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 14న రాత్రి కేబీఆర్ పార్క్లో తనపై జరిగిన దాడి వివరాలను బుధవారం ఆమె కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీలోని ఇంట్లో మీడియాకు వెల్లడించారు. గత మూడేళ్లుగా రోజు సాయంత్రం కేబీఆర్లో వాకింగ్కు వెళ్తున్నాను. ఈనెల 14న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వాకింగ్కు వెళ్లాను. రాత్రి 8 గంటల ప్రాంతంలో తిరిగి వాహనం వద్దకు వస్తుండగా వెనుక నుంచి గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడు. నా రెండు చేతులు వెనక్కి పట్టుకొని డబ్బులివ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. గట్టిగా అరిస్తే ముఖం, మూతిపై పిడిగుద్దులు కురిపించాడు. నగదు లేదని రూ.10 వేలు ఫోన్ పే చేస్తానని ఫోన్ నెంబర్ అడిగాను. అతను తన నెంబర్ చెప్పేందుకు తడబడ్డాడు. నేను 100కు డయల్ చేసే ప్రయత్నం చేశాను. గమనించిన అతను నా ఫోన్ లాక్కున్నాడు. పక్కనే ఉన్న బండరాయిపై నా తలను గట్టిగా బాదాడు. కొద్ది సేపు స్పృహ కొల్పోవడంతో పొదల్లోకి తోసి లైంగిక దాడికి యత్నించగా నాకు స్పృహవచ్చి ప్రతిఘటించాను. నాపై బండరాయి విసరగా రెప్పపాటులో తప్పుకొన్నాను. చంపి నిప్పు పెడతానంటూ బెదిరించాడు. అతికష్టం మీద తప్పించుకున్నాను. కేబీఆర్ పార్క్ ఫెన్సింగ్ ఎక్కి ప్రాణాలతో బయటపడ్డాను. నాపై దాడి చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. కేబీఆర్ పార్క్లో విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాలి. మహిళలు బయటకు వచ్చినప్పుడు పెప్పర్స్ప్రే దగ్గర ఉంచుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీసీపీ రాధాకిషన్రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. -
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
మహారాష్ట్రలోని కల్యాణ్లో ఓ రైలు ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులు మరో కేసులోని డెత్ మిస్టరీని ఛేదించారు. -
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఐ గట్టుమల్లు విచారణ ముగిసింది. గురువారం అర్ధరాత్రి వరకు ఆయన్ను దర్యాప్తు బృందం విచారించింది. -
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా