శంషాబాద్‌ రోడ్డు ప్రమాదం: తాగి కారు నడిపారు

హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. అతివేగంతో

Updated : 19 Apr 2021 15:43 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. అతివేగంతో ఎదురుగా వచ్చిన ఓ కారు ఇటుక లారీ కిందకు దూసుకెళ్లడంతో అది బోల్తా పడి ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భూదాన్(25) అనే వ్యక్తి మృత్యువాతపడ్డాడు. దీంతో మొత్తం మృతుల సంఖ్య ఏడుకు చేరింది.

ఈ ప్రమాదానికి కారణమైన వారిని గిరిప్రసాద్, సంగమేశ్వర్, మల్లేష్‌లుగా పోలీసులు గుర్తించారు. వీరిలో గిరి ప్రసాద్‌ కానిస్టేబుల్‌ కాగా, సంగమేశ్వర్‌ హోంగార్డ్‌గా పనిచేస్తున్నాడు. ముగ్గురు స్నేహితులు కలిసి యాదగిరి గుట్ట వెళ్లారు. అనంతరం ఓఆర్‌ఆర్‌ మీదుగా శంషాబాద్‌కు వచ్చారు. ఓ వెంచర్‌ వద్ద మద్యం సేవించి, కారు నడుపుకొంటూ వచ్చి ఎదురుగా కూలీలతో వస్తున్న లారీని ఢీకొట్టారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వీరిలో హోంగార్డ్‌ సంగమేశ్వర్‌ మద్యం సేవించినట్లు తేల్చారు. గిరిప్రసాద్‌ రక్త నమూనాలను పోలీసులు సేకరించారు. ప్రమాదానికి కారణమైన గిరిప్రసాద్‌ను రిమాండ్‌ చేయడటంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు  పోలీసు ఉన్నతాధికారులు సమాయత్తమవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని