Raj kundra case: రాజ్కుంద్రాతో శిల్పాశెట్టి విడిపోనుందా?
అశ్లీల చిత్రాల వ్యాపారం కేసులో అరెస్టయిన భర్త రాజ్కుంద్రా నుంచి విడిపోయేందుకు శిల్పాశెట్టి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.....
ముంబయి: అశ్లీల చిత్రాల వ్యాపారం కేసులో అరెస్టయిన భర్త రాజ్కుంద్రా నుంచి విడిపోయేందుకు శిల్పాశెట్టి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన సంతానాన్ని కూడా రాజ్కుంద్రాకు దూరంగా ఉంచుతున్నట్లు సమాచారం. అశ్లీల చిత్రాలను చిత్రీకరించి వాటిని విక్రయిస్తున్న కేసులో ముంబయి పోలీసులు రాజ్కుంద్రాను అరెస్టు చేశారు. భర్త వ్యాపారంపై శిల్పాశెట్టిని కూడా పోలీసులు విచారించారు. అయితే ఆయన వ్యాపారం గురించి తనకేమీ తెలియదని.. ఆ విచారణ సందర్భంగా నటి కన్నీరుమున్నీరైంది. భర్త చేసే ఈ చీకటి వ్యాపారం పట్ల విస్తుపోయిన శిల్పా అతడి నుంచి విడిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
శిల్పాశెట్టి స్నేహితురాలు ఒకరు ఓ న్యూస్ ఛానెల్తో మాట్లాడుతూ.. ‘రాజ్కుంద్రాపై ఆరోపణలు రెట్టింపవుతున్నాయి. ఆయన అశ్లీల చిత్రాల వ్యాపారం వెలుగులోకి రావడంతో శిల్పా షాక్కు గురైంది. ఆ విషయం తెలిసి మేం కూడా ఖంగుతిన్నాం’ అని ఆమె పేర్కొన్నారు. ‘రాజ్కుంద్రాకు చెందిన ఆస్తులకు సంబంధించి శిల్పా ఒక్క రూపాయిని కూడా ముట్టుకోవడం లేదు. సినిమాలు చేస్తూ, రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఆమె బాగానే సంపాదిస్తోంది. ఈ మధ్యే ‘హంగామా2’, ‘నికమ్మా’ సినిమాల్లో నటించిన శిల్పా మరిన్ని సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉంది’ అని నటి సన్నిహితురాలు పేర్కొన్నారు.
శిల్పాశెట్టి, రాజ్కుంద్రా 2009లో వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు వియాన్, కుమార్తె షమీశా ఉన్నారు. రాజ్కుంద్రా అశ్లీల చిత్రాలను తెరకెక్కించడమే కాకుండా వాటిని యాప్లలో అప్లోడ్ చేసినట్లు పోలీసులు పేర్కొంటూ జులై 19న ఆయనను అరెస్టు చేశారు. 121 పోర్న్ వీడియోలకు సంబంధించిన అతి పెద్ద డీల్ను చేసుకున్నారని పోలీసులు కోర్టుకు వెల్లడించారు. ఆ మొత్తం వీడియోల విక్రయానికి గానూ 1.2 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.9కోట్లు) ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే