అక్కాచెల్లెళ్ల మరణానికి ఆ నమ్మకమే కారణమా?
ఒక వ్యక్తి నమ్మకం కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. మితిమీరిన విశ్వాసం.. మూఢనమ్మకం.. మూర్ఖపు పరిణామాలకు దారితీసింది. కని పెంచిన చేతులో కన్న బిడ్డలను బలితీసుకునే దారుణానికి ఒడిగట్టింది. చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో
మదనపల్లె ఘటన: విస్తుగొలుపుతున్న అలేఖ్య పోస్ట్లు
ఇంటర్నెట్డెస్క్, హైదరాబాద్: ఒక వ్యక్తి నమ్మకం కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. మితిమీరిన విశ్వాసం.. మూఢనమ్మకం.. మూర్ఖపు పరిణామాలకు దారితీసింది. కని పెంచిన చేతులతో కన్న బిడ్డలను బలితీసుకునే దారుణానికి ఒడిగట్టింది. చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో వెలుగుచూస్తున్న విషయాలు విస్తుగొలుపుతున్నాయి. ఈ ఘటనలో పెద్ద కుమార్తె అలేఖ్య ‘మూఢత్వం’, పునర్జన్మలపై అతి విశ్వాసం అక్కాచెల్లెళ్ల హత్యకు కారణమైంది. హత్యలకు ముందు అలేఖ్య సోషల్మీడియాలో చేసిన పోస్ట్లు.. ఆమె ఆలోచనా ధోరణికి, మానసిక స్థితికి అద్దంపడుతున్నాయి.
మదనపల్లెకు చెందిన పురుషోత్తం, పద్మజల పెద్ద కుమార్తె అలేఖ్య మరణానికి ముందు తన సోషల్మీడియా ఖాతాలో కొన్ని పోస్ట్లు పెట్టింది. ఈ నెల 22న తన పేరును మోహినిగా మార్చుకున్నట్లు పేర్కొన్న ఆమె.. తనని తాను ‘ప్రపంచ సన్యాసి’నని చెప్పుకొంది. ఆ తర్వాత ‘‘శివుడు వస్తున్నాడు’’.. ‘‘పని పూర్తయింది’’ అంటూ మరికొన్ని పోస్టులు చేసింది. శివుడిని ఆరాధించే అలేఖ్య.. పుట్టుక, చావు తన చేతుల్లోనే ఉన్నాయని బలంగా విశ్వసించడం గమనార్హం.
లాక్డౌన్లో విపరీతంగా పుస్తకపఠనం..
కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో చిత్తూరుకు వచ్చిన అలేఖ్య.. నెలల తరబడి ఇంటికే పరిమితమైంది. సహజంగానే పుస్తకాలపై ఆసక్తి ఉన్న ఆమె.. లాక్డౌన్ కాలాన్ని పూర్తిగా పుస్తక పఠనానికే కేటాయించింది. మహాభారతం వంటి చారిత్రక పుస్తకాలతో పాటు.. రాజకీయాలు, స్త్రీ సమానత్వం... వంటి అంశాలపై పుస్తకాలను కూడా చదివింది. ఆ ప్రభావం అలేఖ్యపై బాగానే పడినట్లు కన్పిస్తోంది.
అయస్కాంతశక్తిగా.
ఓ ఆధ్యాత్మికవేత్తను తన గురువుగా భావిస్తున్న అలేఖ్య.. తరచూ ఆయన చెప్పిన కొటేషన్లను పోస్ట్ చేసేది. ఆయనను తన ప్రేమికుడిగా పేర్కొన్న ఆమె.. తన స్టడీరూంలో అతడి ఫొటోను పెట్టుకుంది. ఆయన రాసిన పుస్తకాలను కూడా చదివింది. వివాహ వ్యవస్థపై నమ్మకం కోల్పోయినట్లు కూడా ఆమె పోస్ట్లను బట్టి తెలుస్తోంది. జుట్టును కొప్పుగా చుట్టుకుని హెయిర్ పిరమిడ్ అని, అది ఆమె అయస్కాంత శక్తిగా అభివర్ణించింది.
నిరాశ నుంచి భయంలోకి..
ఈ నెల 15న ఆమె ఓ కవితను పోస్ట్ చేసింది. అందులో ఆమె నిరాశలో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ‘‘నా గుండె నిశ్శబ్దంగా ఏడుస్తోంది. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకోవడం కోసం నేను ఎవరినో కావాలని ప్రయత్నిస్తున్నాను.. కానీ అవి ఫలించలేదు. నా ఆశలు కాలిపోయాయి. నిరాశ అనే అగాధంలో కూరుకుపోయాను. ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గందరగోళంలో పడిపోయాను. ఇలాంటి సమయంలో నాలో కొత్త ఆలోచనలు ఉదయించాయి. వాటిని నేను హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నాను’’ అని ఆమె రాసుకొచ్చింది.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!