Crime News: పది రూపాయల కోసం కాల్పులు..
పది రూపాయల కోసం తుపాకీతో కాల్పులు జరిపాడో వ్యక్తి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
పది రూపాయల కోసం తుపాకీతో కాల్పులు జరిపాడో వ్యక్తి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఝార్ఖండ్లోని పలమూ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నిందితుడిని సోనూ సోనిగా గుర్తించారు. నిందితుడు.. మరో ముగ్గురితో కలిసి వినయ్ గుప్తాకు చెందిన మద్యం దుకాణానికి వచ్చాడు. అనంతరం వారంతా మద్యం కొన్నారు. బాటిల్పై అదనంగా పది రూపాయలు ఇవ్వాల్సిందిగా వినయ్ డిమాండ్ చేశాడు. దీంతో సోనూ అతడిపై గొడవకు దిగాడు. వినయ్కు మద్దతుగా తన సోదరులు వచ్చారు. అనంతరం సోనూ సోని వారిపై ఏడు రౌండ్లు కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని నిందితుని కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. సోనూ సోని ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు వారు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Viral video: ఆడీలో వచ్చి.. పంటను విక్రయిస్తున్న రైతు
-
Ratan Tata: ‘ఈ శునకం తప్పిపోయింది..’: వైరల్ అవుతున్న రతన్ టాటా పోస్ట్
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Shooting In Asian Games: భారత బంగారు గని షూటింగ్.. టీనేజర్ల పతకాల పంట
-
Nara Lokesh: ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో నారా లోకేశ్కు సీఐడీ నోటీసు
-
Rs 2000 Notes Exchange: రూ.2 వేల నోటు మార్చుకునేందుకు మరొక అవకాశం.. ఎప్పటివరకూ అంటే?