అక్షరం వాసిలో తప్పించుకుబోయాడు!
ఒక్క అక్షరంలో దొర్లిన దోషం కారణంగా ఓ నేరగాడు తప్పించుకోబోయాడు. ఎఫ్ఐఆర్ టైపింగ్లో దొర్లిన పొరపాటును ఆసరాగా చేసుకుని అత్యాచార నేరం నుంచి నిర్దోషిగా బయటపడబోయాడు. హైకోర్టు జోక్యం చేసుకుని.....
చెన్నై: ఒక్క అక్షరంలో దొర్లిన దోషం కారణంగా ఓ నేరగాడు తప్పించుకోబోయాడు. ఎఫ్ఐఆర్ టైపింగ్లో దొర్లిన పొరపాటును ఆసరాగా చేసుకుని అత్యాచార నేరం నుంచి నిర్దోషిగా బయటపడబోయాడు. హైకోర్టు జోక్యం చేసుకుని దిగువస్థాయి కోర్టు తీర్పును తిరగదోడడంతో దోషిగా తేలాడు. జైలుకు వెళ్లాడు. ఒక్క అక్షరం కూడా ఎంత ముఖ్యమో తెలియజెప్పే ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరువూరు జిల్లాకు చెందిన ప్రకాశ్ అనే వ్యక్తి 2017 సెప్టెంబర్లో రెండున్నరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పని మీద బయటకు వెళ్లిన తల్లి ఇంటికొచ్చి చూసేసరికి చిన్నారి ఏడుస్తూ కనిపించింది. వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్పించి.. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తల్లి వాంగ్మూలం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఎఫ్ఐఆర్లో semen (వీర్యం) బదులు.. Semman (తమిళంలో ఎర్రటి ఇసుక) అని పోలీసులు పేర్కొన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని దిగువ న్యాయస్థానంలో డిఫెన్స్ లాయర్ వాదనలు వినిపించడంతో నిందితుడు నిర్దోషి అని కోర్టు తీర్పు వెలువరించింది.
ఈ కేసుపై తాజాగా విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు.. దిగువ స్థాయి న్యాయస్థానం తీర్పును కొట్టివేసింది. ప్రకాశ్ను దోషిగా నిర్ధారిస్తూ ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే బాలిక కుటుంబానికి లక్ష రూపాయలు పరిహారం చెల్లించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా దర్యాప్తు అధికారుల తీరును తప్పుబట్టింది. ఇలాంటి కేసుల్లో ఏమాత్రం అవకాశం దొరికినా దోషులు తప్పించుకు పారిపోతారని, అప్రమత్తత అవసరం అని హెచ్చరించింది. దిగువస్థాయి న్యాయస్థానం వైఖరిని సైతం తప్పుబట్టింది. ప్రతిసారీ ఆధారాలే కాదు.. విచక్షణాధికారాలు ఉపయోగించాల్సి ఉంటుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేలుమురగన్ అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM