Visakha HPCL: అదుపులోకి వచ్చిన మంటలు
హెచ్పీసీఎల్ ప్రమాద ఘటనలో మంటలు అదుపులోకి వచ్చాయని విశాఖ జిల్లా కలెక్టర్ విజయ్చంద్ వెల్లడించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఎవరికీ
ప్రాణనష్టం లేదన్న కలెక్టర్
విశాఖ: హెచ్పీసీఎల్ ప్రమాద ఘటనలో మంటలు అదుపులోకి వచ్చాయని విశాఖ జిల్లా కలెక్టర్ విజయ్చంద్ వెల్లడించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అరగంటలో మంటలను అదుపులోకి తీసుకొచ్చారన్నారు. ప్రమాదం గురించి ఎవరికీ ఆందోళన అవసరం లేదని ఆయన అన్నారు. అలారం మోగడంతో అందరం బయటికొచ్చేశామని అందులో పని చేస్తున్న కార్మికులు చెబుతున్నారు. సహాయక చర్యల్లో నావికా, హెచ్పీసీఎల్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫైర్ సెన్సార్లు పని చేయడంతో ప్రాణనష్టం తప్పింది. ఘటనా స్థలానికి మంత్రి అవంతి శ్రీనివాసరావు చేరుకున్నారు. ప్రమాదంపై ఆరా తీస్తున్నారు.
ఇవాళ మధ్యాహ్నం 3 గంటల సమయంలో విశాఖ హెచ్పీసీఎల్లో అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి వెంటనే దట్టమైన పొగలు, మంటలు కమ్ముకున్నాయి. దీంతో సిబ్బంది, కార్మికులతోపాటు స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అత్యవసర సమయంలో మోగించే మూడు సైరన్లను మోగించి సిబ్బంది, కార్మికులను బయటకు పంపించి వేశారు. గతంలో సంభవించిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఏం జరుగుతుందోనని గాజువాక, మల్కాపురం పరిసర ప్రాంతవాసులు భయాందోళనలకు గురయ్యారు. ముడి చమురును శుద్ధి చేసే సీడీయూ మూడో యూనిట్లో ప్రమాదం జరిగిందని తెలుసుకొని మరింత భయపడ్డారు. ఇది చాలా సున్నితమైన యూనిట్, అత్యంత మండే స్వభావం గల పదార్థాలన్నీ అధిక మొత్తంలో ఇక్కడ ఉంటాయి. మంటల తీవ్రత అంతకంతకూ పెరిగిపోవడంతో భయకంపితులయ్యారు. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి అత్యాధునిక పరికరాలతో ప్రత్యేక పద్ధతిలో మంటలను అదుపు చేశారు. మొత్తం 20 అగ్నిమాపక యంత్రాలు, హెచ్పీసీఎల్ అగ్నిమాపక సిబ్బంది తోపాటు నావికా సిబ్బంది, పోలీసులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.