Accident: కారును ఢీకొట్టి పాదచారులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఆరుగురి దుర్మరణం!

హైవేపై వేగంతో వస్తున్న ట్రక్కు కారును ఢీకొట్టి ఆ తర్వాత పాదచారులపైకి దూసుకెళ్లింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందినట్టు సమాచారం.

Published : 22 Jan 2023 23:53 IST

ఉన్నావ్‌‌: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటుచేసుకుంది. రోడ్డుపై వేగంగా ప్రయాణిస్తున్న ఓ ట్రక్కు కారును ఢీకొట్టి పాదచారుల(pedestrians)పైకి దూసుకెళ్లింది. ఉన్నావ్‌(Unnao) జిల్లాలోని లఖ్‌నవూ-కాన్పూర్‌ హైవేపై జరిగిన ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురికి గాయాలైనట్టు సమాచారం. అలాగే, ట్రక్కు ఢీకొట్టిన కారులో నలుగురు నుంచి ఐదుగురి ఉన్నట్లు తెలుస్తోంది. వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు క్రేన్‌ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అచల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై సమాచారం తెలియడంతో అసిస్టెంట్‌ ఎస్పీ శశి శేఖర్‌ సింగ్‌ అక్కడికి చేరుకొని సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని