Ratlam: బస్టాప్లో ప్రయాణికులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఆరుగురి మృతి!
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రత్లాం(Ratlam) జిల్లాలో రోడ్డుపక్కన బస్టాప్లో నిల్చుని ఉన్న జనాలపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
భోపాల్: మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రత్లాం(Ratlam) జిల్లాలో రోడ్డుపక్కన బస్టాప్లో నిల్చుని ఉన్న ప్రయాణికులపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ నరేంద్ర కుమార్ సూర్యవంశీ ఈ వివరాలను ధ్రువీకరించారు. జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో రత్లాం- లెబాడ్ రహదారిపై సత్రుండా గ్రామ సమీపంలోని ఓ కూడలి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వాహనం ముందు టైరు పేలిపోవడంతో అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
తమవైపు అతి వేగంగా దూసుకొచ్చిన ఆ ట్రక్కు దాదాపు 20 మందిని ఢీకొట్టిందని.. క్షతగాత్రుల్లో ఒకరైన విశాల్ తెలిపారు. ట్రక్కు ఒక్కసారిగా మీదికి రావడంతో జనాలంతా భయాందోళనకు గురై పరుగులు పెట్టారని, అంతలోనే వాహనం వారిపైనుంచి వెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. రోడ్డుపైనే మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయని తెలిపారు. లారీ డ్రైవర్ ఘటనాస్థలం నుంచి పరారైనట్లు చెప్పారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కును స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక ఎస్పీ అభిషేక్ తివారీ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!