Crime news: ఆరేళ్ల బాలికపై ఏడాదిగా నలుగురి అత్యాచారం.. అందరూ మైనర్లే!

 అభం శుభం తెలీని ఆరేళ్ల బాలికపై ఏడాదిగా నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనలో నిందితులు నలుగురూ మైనర్లే కావడం గమనార్హం.

Published : 03 May 2022 01:55 IST

హోషియార్‌పూర్‌ (పంజాబ్‌): అభం శుభం తెలీని ఆరేళ్ల బాలికపై ఏడాదిగా నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనలో నిందితులు నలుగురూ మైనర్లే కావడం గమనార్హం. సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరొకరు పరారీలో ఉన్నారు.

పంజాబ్‌ హోషియార్‌పూర్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలికపై నలుగురు బాలురు ఏడాదిగా అత్యాచారానాకి పాల్పడ్డారు. ఇటీవల తన తల్లిదండ్రులకు ఆ బాలిక ఈ విషయాన్ని తెలియజేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీనిపై బాలిక తల్లిదండ్రులు ఇటీవల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో చట్టంపై నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని జువైనల్‌ హోమ్‌కు తరలించారు. వీరి వయసు 10-11 సంవత్సరాలే! ఏడాది పాటు పలుమార్లు బాలికపై వీరు అత్యాచారానికి పాల్పడినట్లు దర్యాప్తు అధికారి కమలేశ్‌ కుమారి తెలిపారు. 14 ఏళ్ల వయసున్న మరో బాలుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని