Hyderabad News: క్రికెట్‌ ఆడుతూ కుప్పకూలిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి..

క్రికెట్‌ ఆడుతూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతిచెందిన ఘటన హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

Updated : 10 Aug 2022 11:57 IST

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

రాజేంద్రనగర్‌: క్రికెట్‌ ఆడుతూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతిచెందిన ఘటన హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. గుజరాత్‌కు చెందిన తుస్సార్‌ అనే వ్యక్తి నగరంలోని ఓ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. 

బుధవారం రాజేంద్రనగర్‌ పరిధిలోని సన్‌సిటీ ఎస్‌బీఐ గ్రౌండ్‌లో తుస్సార్‌ క్రికెట్‌ ఆడుతూ ఒక్కసారి కుప్పకూలిపోయారు. వెంటనే స్థానికులు ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. దీనిపై రాజేంద్రనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుండెపోటుతో తుస్సార్‌ చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని