Software Engineer: చంద్రగిరిలో దారుణం.. కారులో వెళ్తుండగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సజీవ దహనం

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో దారుణం చోటుచేసుకుంది. నాయుడుపేట-పూతలపట్లు రోడ్డులో గంగుడుపల్లె వద్ద ఓ వ్యక్తిని దుండగులు సజీవ దహనం చేశారు.

Updated : 02 Apr 2023 14:04 IST

చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో దారుణం చోటుచేసుకుంది. నాయుడుపేట-పూతలపట్టు రోడ్డులో గంగుడుపల్లె వద్ద ఓ వ్యక్తిని దుండగులు సజీవ దహనం చేశారు. కారులో ఉండగానే పెట్రోలు పోసి తగులబెట్టారు. స్థానికుల సమాచారంతో పోలీసుల ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. 

మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో కారు నంబర్‌ ఆధారంగా వివరాలు సేకరించారు. కారులో మృతిచెందిన వ్యక్తిని వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నాగరాజుగా గుర్తించారు. మృతుడు బెంగళూరులోని ప్రముఖ సంస్థలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి బ్రాహ్మణపల్లికి వెళ్తుండగా శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కారును దుండగులు ఆపి ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పారు. సజీవ దహనం చేయడానికి గల కారణాలేంటనే దానిపై విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని