Andhra News: నెల్లూరులో యువతిని తుపాకీతో కాల్చి.. ఆపై తానూ కాల్చుకొని..
ల్లూరు జిల్లాలోని పొదలకూరులో దారుణం చోటుచేసుకుంది. యువతిపై యువకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అదే తుపాకీతో తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తిలో సోమవారం మధ్యాహ్నం చోచుచేసుకుంది....
పొదలకూరు: నెల్లూరు జిల్లాలోని పొదలకూరులో దారుణం చోటుచేసుకుంది. యువతిపై యువకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అదే తుపాకీతో తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తిలో సోమవారం మధ్యాహ్నం చోచుచేసుకుంది.
ఎస్పీ విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తికి చెందిన మాలపాటి సురేశ్రెడ్డి, పొలకూరు కావ్య సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ఉద్యోగరీత్యా వీరిద్దరూ గతంలో బెంగళూరులో ఉండేవారు. ప్రస్తుతం వర్క్ఫ్రమ్ హోం కావడంతో స్వగ్రామం తాటిపర్తి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటానని గత కొంతకాలంగా కావ్యను సురేశ్ ఇబ్బంది పెడుతూ వచ్చాడు. సురేశ్రెడ్డి వైపు నుంచి ఏకపక్షంగా ప్రేమ వ్యవహారం నడిచింది. కావ్యకు సురేశ్రెడ్డి ఫోన్లు చేస్తూ మేసేజ్లు పెట్టేవాడు. పెళ్లి చేసుకుంటానని గత నెల యువతి ఇంటికి తన తల్లిదండ్రులను పంపించాడు. పెళ్లి ప్రతిపాదనను కావ్య తల్లిదండ్రులు నిరాకరించారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల తర్వాత కావ్య ఇంటికి సురేశ్రెడ్డి వెళ్లాడు. అడ్డువచ్చిన కావ్య చెల్లెలిని తోసేసి కాల్పులు జరిపాడు. కావ్యపై సురేశ్ రెండు రౌండ్లు కాల్పలు జరిపాడు. తొలిసారి జరిపిన కాల్పుల నుంచి కావ్య తప్పించుకుంది. రెండో రౌండ్ కాల్పుల్లో కావ్య తల నుంచి తూటా దూసుకెళ్లింది. కావ్య శవపరీక్ష తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. తుపాకీపై మేడ్ ఇన్ యూఎస్ఏ అని ఉంది. నిందితుడికి తుపాకీ ఎలా వచ్చిందనే వివరాలను ఆరా తీస్తున్నాం. సురేశ్కి చెందిన 2 సెల్ఫోన్లను సీజ్ చేశాం. సెల్ఫోన్ వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం’’ అని ఎస్పీ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రీవెడ్డింగ్ ఫంక్షన్లో వివాదం..యువకుడిని టెర్రస్పై నుంచి తోసేసిన వ్యాపారవేత్త
ఓ ప్రీవెడ్డింగ్ వేడుకలో సరదాగా గడుపుతున్న సమయంలో యువకుల మధ్య జరిగిన చిన్న వివాదం ఓ వ్యక్తికి ప్రాణాంతకంగా మారింది. -
బాలుడిని చంపేసి.. ఆత్మహత్య చేసుకుని..!
చోరీ చేసి.. డబ్బులు పంచుకునే క్రమంలో జరిగిన గొడవలో ఓ యువకుడు బాలుడిని హత్య చేసి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
హైదరాబాద్లో అమానుషం.. మహిళపై ఇద్దరు యువకుల అత్యాచారం
చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే ఓ మహిళ.. తెల్లవారుజామున ఇద్దరు యువకుల కంటపడింది. కన్నూమిన్నూ కానకుండా వారు ఆమెపై పాశవికంగా లైంగికదాడికి పాల్పడ్డారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ విద్యార్థుల దుర్మరణం
అమెరికాలో శనివారం రాత్రి(భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు తెలంగాణ విద్యార్థులను బలిగొంది. -
పవన్ సభలో చాకుతో యువకుడు
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ వారాహి విజయభేరి యాత్రలో భాగంగా భీమవరం ప్రకాశం చౌక్లో ప్రసంగిస్తున్న సమయంలో ఇద్దరి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
ట్రక్కును ఢీకొట్టిన కారు.. రాజస్థాన్లో 9 మంది మృతి
పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఓ కారు ట్రక్కును ఢీకొనడంతో తొమ్మిది మంది మరణించారు. రాజస్థాన్లోని ఝలావాఢ్లో ఆదివారం ఈ ప్రమాదం సంభవించింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు నేత మృతి
ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లా కేస్కుతుల్-కేశముండి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆదివారం ఓ మావోయిస్టు నేత మృతి చెందాడు. -
వార్డు సచివాలయంలో పట్టుబడ్డ మద్యం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వార్డు సచివాలయంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. -
చంద్రబాబు సభకు వెళ్లారని హత్యాయత్నం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో శనివారం జరిగిన చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లాడనే అక్కసుతో తెదేపా కార్యకర్తపై వైకాపా మద్దతుదారులు హత్యాయత్నానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
రాణించిన సూచీలు.. 22,300 ఎగువకు నిఫ్టీ
-
8 ఏళ్ల జీతం 4 వారాల్లో తిరిగివ్వాలా?.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తాం: మమత
-
తెలంగాణ ప్రజలకు చల్లని కబురు.. మూడు రోజుల పాటు వర్షాలు
-
సత్తెనపల్లిలో బరితెగించిన వైకాపా నేతలు.. తెదేపా శ్రేణులపై దాడి
-
డీప్ఫేక్ వీడియోపై రణ్వీర్ సింగ్ పోలీస్ కేసు
-
ఎంపీ అభ్యర్థి మాధవీలతతో ఏఎస్సై ఆలింగనం.. సస్పెండ్ చేసిన సీపీ