Bhadradri: తనయుడి చేతిలో తండ్రి హతం

కన్న తండ్రినే ఓ మైనర్‌ కొడుకు సుత్తితో కొట్టి చంపాడు. కారు కొనేందుకు డబ్బులు ఇవ్వలేదనే కారణంతోనే ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

Updated : 11 Jun 2023 00:37 IST

భద్రాద్రి కొత్తగూడెం: జల్సాలకు అలవాటు పడిన మైనర్ కొడుకు కన్నతండ్రినే హత్య చేశాడు. కారు కొనేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో తండ్రి నిద్రపోతున్న సమయంలో సుత్తితో కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్‌ మండలంలోని సారపాకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జాఫర్‌ (39) స్థానిక ఐటీసీ కర్మాగారంలో సాధారణ లేబర్‌గా పని చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం పెద్దల తరఫున ఆస్తి జాఫర్‌కు వచ్చింది. ఆ డబ్బుతో కారు కొనివ్వాలని జాఫర్‌ను కొడుకు అడగటం మొదలు పెట్టాడు. డబ్బులు ఇవ్వకుండా అకౌంట్లోనే ఉంచడంతో ఆగ్రహానికి గురైన కొడుకు.. డ్యూటీకి వెళ్లి వచ్చిన తండ్రి నిద్రపోతుండగా.. సుత్తితో తలపై కొట్టి హత్య చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ద్వారా విచారణ చేపట్టారు. జాఫర్‌ను కొడుకే హత్య చేశాడని, అతడికి తల్లి సహకరించినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. భార్యాభర్తలకు కూడా కొన్ని వివాదాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని