Uganda: న్యూ ఇయర్ వేడుకల్లో తొక్కిసలాట.. 9మంది మృత్యువాత!
కొత్త సంవత్సర వేడుకల వేళ ఉగాండాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ షాపింగ్ మాల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు.
కంపాలా: నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ ఉగాండాలో పెను విషాదం చోటుచేసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా ఓ ప్రముఖ షాపింగ్ మాల్ వద్ద నిర్వహించిన వేడుకల్లో తొక్కిసలాట జరగ్గా.. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మ్యూజిక్ కన్సార్ట్లు, న్యూ ఇయర్ వేడుకలకు ప్రసిద్ధిగాంచిన ఫ్రీడమ్ సిటీ మాల్లో అర్ధరాత్రి బాణసంచా వెలుగులు చూసేందుకు జనం ఎగబడటంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కంపాలా మెట్రోపాలిటన్ డిప్యూటీ పోలీస్ అధికార ప్రతినిధి ల్యూక్ ఓయెస్గిరీ మాట్లాడారు. చిన్నారులతో పాటు మొత్తం తొమ్మిది మంది మృత్యువాత పడినట్టు తెలిపారు. అర్ధరాత్రి వేళ షాపింగ్ కాంప్లెక్స్ నుంచి బయటకు వెళ్లి బాణసంచా వెలుగుల్ని చూడాలని చెప్పడంతో అంతా ఒకేసారి బయటకు వెళ్లిన సందర్భంలో ఈ దుర్ఘటన జరిగినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని.. ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు జరగలేదన్నారు. ఘటనా స్థలంలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు ప్రాణాలు విడిచారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.