Hyderabad: ఫోన్‌ ఎక్కువగా మాట్లాడుతోందని..గొంతు నులిమి కుమార్తె హత్య

ఎంత చెప్పినా వినకుండా, స్నేహితుడుతో అర్ధరాత్రి వరకు ఫోన్‌ మాట్లాడుతోందని ఓ సవతి తండ్రి తన కుమార్తెను హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

Updated : 18 Dec 2022 12:16 IST

రామ్‌నగర్‌: స్నేహితుడితో అర్ధరాత్రి వరకు ఫోన్‌ మాట్లాడుతోందన్న కోపంతో ఓ సవతి తండ్రి తన కుమార్తెను హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ జహంగీర్‌ యాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి వరకు ఫోన్‌ మాట్లాడవద్దని ఎన్ని సార్లు చెప్పినా వినకపోవడంతో సాదిక్‌ అనే సవతి తండ్రి తన 17  ఏళ్ల కుమార్తెను ఆదివారం గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ముషీరాబాద్‌ ఠానాలో లొంగిపోయాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని