Crime News: సవతి పిల్లలకు చికెన్‌లో విషం

తన భర్త మొదటి భార్య పిల్లలకు విషమిచ్చి చంపాలని చూసింది ఓ సవతి తల్లి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

Updated : 26 Nov 2022 08:52 IST

తన భర్త మొదటి భార్య పిల్లలకు విషమిచ్చి చంపాలని చూసింది ఓ సవతి తల్లి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఝార్ఖండ్‌ గిరిదిహ్‌ జిల్లాలోని రోహంతాండ్‌కు చెందిన సునీల్‌ సోరైన్‌ భార్య రెండేళ్ల క్రితం పాము కాటుకు గురై చనిపోయింది. అప్పటికే ఆమె ఓ కుమార్తె, నలుగురు మగ పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సునీల్‌... గోరియాచు గ్రామానికి చెందిన సునీత హన్డ్సా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమెకు పిల్లలు లేరు. సెప్టెంబర్‌లో మొదటి భార్య పిల్లలందరినీ వాళ్ల తాతయ్య, నానమ్మ దగ్గర వదిలిన సునీత.. భర్తతో కలిసి దుర్గాపూజ కోసం సొంతూరుకు వెళ్లింది. పూజ అనంతరం సునీల్‌ ఉపాధి కోసం బెంగళూరు వెళ్లాడు. బుధవారం రోహంతాండ్‌కు వచ్చిన సునీత.. గురువారం ఉదయం అనిల్‌ సోరైన్‌(3), శంకర్‌ సోరైన్‌(8), విజయ్‌ సోరైన్‌(12)కు చికెన్‌లో విషం కలిపి తినిపించింది. వారి ఆరోగ్యం క్షీణించిన అనంతరం పారిపోయింది. ఘటనలో అనిల్‌ సోరైన్‌ మృతి చెందగా, శంకర్‌ సోరైన్‌ పరిస్థితి విషమంగా ఉంది. విజయ్‌ సోరైన్‌ ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు వారు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని