23వ అంతస్తు నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య 

మనోవేదనతో బాధపడుతున్న ఓ విద్యార్థిని భవనంపై దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం గచ్చిబౌలిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సురేశ్‌ తెలిపిన

Published : 23 Mar 2021 01:09 IST

గచ్చిబౌలి: మనోవేదనతో బాధపడుతున్న ఓ విద్యార్థిని భవనంపై దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం గచ్చిబౌలిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సురేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నానక్‌రాంగూడలోని మంత్రి సిలేస్టియా అపార్ట్‌మెంట్‌ 23వ అంతస్తులో మౌనిక సిన్హా తన కూతురు ఇషా రంజన్‌ (17)తో కలిసి ఉంటుంది. ఇషా రంజన్‌ స్థానికంగా ఉన్న ఓ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గత కొంత కాలంగా తీవ్ర మనోవేదనతో బాధపడుతున్న ఇషా సోమవారం సాయంత్రం అపార్ట్‌మెంట్‌ బాల్కనీ నుంచి కిందికి దూకింది. దీంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలిని చేరుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇషా గతంలో పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు సురేశ్‌ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని