పోస్టుమాస్టర్‌ దంపతుల ఆత్మహత్యాయత్నం

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడులో అప్పుల బాధ భరించలేక పోస్టల్‌ ఉద్యోగి దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానిక...

Published : 16 Jun 2021 01:20 IST

ఉంగుటూరు: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడులో అప్పుల బాధ భరించలేక పోస్టల్‌ ఉద్యోగి దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానిక పోస్టుమాస్టర్‌ రఘుబాబు ఇటీవల పలు ఆరోపణలపై సస్పెండ్‌ అయ్యారు.  కుటుంబ అవసరాల కోసం పలువురి నుంచి తీసుకున్న అప్పు తీర్చేందుకు గడువు కోరాడు. వెంటనే చెల్లించాలని వడ్డీ వ్యాపారులు ఒత్తిడి చేయడంతో తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. 

పెద్దఅవుటుపల్లిలోని ఓ ప్రైవేటు గృహంలో రఘుబాబు దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. స్థానికుల సమాచారంతో బాధితులను ఆత్కూరు పోలీసులు ఆసుపత్రికి తరలించారు. విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రఘుబాబు మృతి చెందగా..అతని భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈనెలలో రఘుబాబు తిరిగి విధుల్లో చేరనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు